తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇండ్ల పథకం' (Indiramma Indlu Scheme) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంతిల్లు లేని పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే, దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక మరియు అర్హతల విషయంలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
దరఖాస్తుల వెల్లువ: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో భారీ ఎత్తున దరఖాస్తులు స్వీకరించగా, అర్హులైన పేదలను గుర్తించే ప్రక్రియలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరుపుతున్నారు.
అర్హత నిబంధనలు: తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఈ పథకం మొదటి ప్రాధాన్యత కింద వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
రాజకీయ విమర్శలు - స్పందనలు: లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, అర్హులందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
సమగ్ర పరిశీలన అవసరం: ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కెసిఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పప్పు బెల్లాల్లా అమ్ముకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరిట దందాకు తెరతీసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లను అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారని, కాంగ్రెస్ నేతలు, వారి అనుచరులు ఈ అక్రమ దందాకు తెరలేపారని వార్తలు వస్తున్నాయి.
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. రాయదుర్గం, జూబ్లీహిల్స్, కూకట్పల్లి వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఏకంగా రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా ప్రాంతాల్లో ఏరియాను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా ధర నిర్ణయించి సిఫార్సులతో ఇల్లు వచ్చేలా చేస్తామని నమ్మబలుకుతున్నారు.
అక్రమార్కుల వలలో చిక్కుకొని..
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు మీసేవా కేంద్రాలకు కొద్దిరోజులుగా వరుస కడుతున్నారు. మంత్రులు, కాంగ్రెస్ నేతలమని చెప్పుకుంటూ కొంతమంది మీసేవా కేంద్రాలు, హౌసింగ్ బోర్డు కార్యాలయం ముందు తిష్టవేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించి, లాటరీలో పేరు రాకున్నా ఇల్లు ఇప్పిస్తామంటూ గాలం వేస్తున్నారు. మరోవైపు హౌసింగ్ బోర్డు అధికారులు తాము చెప్పిన వారికే ఇండ్లు కేటాయిస్తారని దళారులు దందా సాగిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెడుతూ ఇందిరమ్మ ఇండ్లను అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.







